తెలంగాణ

ట్రాక్టర్లపై తరలివచ్చిన శ్రేణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్టస్రమితి ముందుగా నిర్ణయించిన ప్రకారమే వరంగల్‌లో గురువారం జరిగిన పార్టీ ఆవిర్భావ బహిరంగ సభకు వివిధ జిల్లాల నుంచి పార్టీకార్యకర్తలు, ప్రజలు ట్రాక్టర్లపైన వరంగల్ నగరానికి చేరుకున్నారు. మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లానుంచి, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నుంచి వందల ట్రాక్టర్లలో జనాలు గురువారం తెల్లవారుజాముకే వరంగల్ చేరుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీగా ట్రాక్టర్లలో ఆ జిల్లాల కార్యకర్తలు వరంగల్ చేరుకున్నారు. నగర శివారు హసన్‌పర్తి నుంచి మంత్రి పోచారం ట్రాక్టర్ నడుపుకుంటూ నగరంలోకి వచ్చారు. వేసవి ఎండల తీవ్రతను తట్టుకునేందుకు ట్రాక్టర్లపైన దుప్పట్లు, గోనెపట్టాలు కప్పి ఎండనుంచి రక్షణ పొందేందుకు ప్రయత్నించారు.

చిత్రం..భారీగా తరలివచ్చిన ట్రాక్టర్లు