తెలంగాణ

నిధుల కోసం జడ్పీటిసిల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 10: తెలంగాణ ప్రభుత్వం జడ్పీటిసిలకు నిధులు, అధికారాలు కల్పించకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చివేసిందని, మం త్రుల పక్కన ఫొటోలకు ఫోజులివ్వడం తప్పా అభివృద్ది పనుల్లో తమకు ఏమాత్రం గౌరవం దక్కడం లేదని జడ్పీటిసిలు నిరసన వ్యక్తం చేశారు. జిల్లాల పునర్విభజన అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలో తొలిసారిగా జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభం కాగానే అధికార పార్టీకి చెందిన జడ్పీటిసిలు నిల్చొని అధికారాలపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జడ్పీటిసిలకు తగిన గుర్తింపు లభించడం లేదని, గ్రామాల్లోకి వెళ్తే సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జడ్పీ సమావేశం బహిష్కరిస్తున్నట్లు సభ్యులు మూకుమ్మడిగా ప్రకటించి వెళ్తుండగా వెంటనే జోక్యం చేసుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జడ్పీటిసిల సమస్యలను హైదరాబాద్‌కు వెళ్ళి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, మంత్రి జూపల్లికి విన్నవిం చి సమస్య పరిష్కరిస్తామని హా మీ ఇచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, శాసన సభ్యులు కోనేరు కోనప్ప, రాథోడ్ బాపురావు, కోవ లక్ష్మి, రేఖానాయక్, ఎమ్మెల్సీలు పురాణం సతీష్, సుధాకర్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డితో పాటు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు, జడ్పీటిసిలు పాల్గొన్నారు.