తెలంగాణ
రెచ్చిపోతున్న దొంగలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మే 14: హైదరాబాద్ నగరశివారులో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసివున్న ఇళ్లను, ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం ఓ వృద్ధురాలిని బంధించి పది తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. పివి ఎక్స్ప్రెస్ వే పిల్లర్ 38 సమీపంలోని దిల్షాద్నగర్లో నిర్మల అనే వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను బంధించారు. ఆమె ఒంటిపై గల పది తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దోపిడీ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల రాష్ట్రంలో ప్రవేశించిన ఒడిశా, మహరాష్టక్రు చెందిన చడ్డీ-బనియన్ గ్యాంగే ఈ దోపిడీకి పాల్పడవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు సమాచారమందించి దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు.