తెలంగాణ

ఆలయాలకు పాలక మండళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16:రాష్ట్రంలోని పలు ఆలయాలకు పాలక మండలి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి 14 మంది పాలక మండలి సభ్యులను నియమించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉర్కొండ పేట్ ఆంజనేయ స్వామి దేవాలయానికి 14 మందిని , గంగాపూర్ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి 13 మందిని, సంగారెడ్డి జిల్లా గుమ్మిడ్యాల మండలం బొంతపల్లి శ్రీవీరభద్రస్వామి ఆలయానికి 14 మందిని, పటాన్‌చెరు మండలం రుద్రారం శ్రీగణేష్ ఆలయానికి 14మందిని పాలక మండలి సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 70 ఆలయాలకు పాలక మండలి సభ్యులను నియమించారు.