తెలంగాణ

కసాయ తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, మార్చి 28: తాగిన మైకంలో ఓ కసాయి తండ్రి ముక్కుపచ్చలారని చిన్నారిని తన చేతులతోనే చిదిమేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నవీన్, ఇస్సపల్లి మమత దంపతులకు నాలుగు నెలల కుమారుడు రిషివర్ధన్ సంతానం. అయితే నవీన్ ప్రతిరోజు తప్పతాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఆదివారం కూడా తాగిన మైకంలో ఇంటికి చేరిన నవీన్ తన భార్యతో గొడవపడ్డాడు. అనంతరం మమత తన కుమారుడిని తీసుకుని నిద్రించగా, మద్యం మత్తులో ఉన్న నవీన్ విచక్షణను కోల్పోయి తన కన్న కుమారుడిపై విరుచుకుపడ్డాడు. తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారిని చేతుల్లోకి తీసుకుని గొంతు పిసికి చంపేశాడు. అనంతరం బాబును తల్లి ఒడిన చేర్చి, తనకేమీ తెలియనట్టుగా అమాయకంగా నిద్రపోయాడు. అయితే సోమవారం ఉదయం నిద్ర లేచిన మమత తన కుమారుడు చలనం లేకుండా ఉండడాన్ని గమనించి ఆందోళనకు గురైంది. చిన్నారి శ్వాస ఆడకపోవడంతో చనిపోయాడని తెలిసి గుండెలవిసేలా రోదించింది. ఆమె రోదనలు విన్న ఇరుగుపొరుగు వారు చేరుకుని పరిశీలించారు. ఆదివారం రాత్రి పడుకునే వరకు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండి, హుషారుగా ఉన్న చిన్నారి ఉదయం నిద్రలేచేసరికి విగతజీవిగా మారడాన్ని చూసి పలువురు అనుమానిస్తూ బాలుడి శరీరాన్ని నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారి గొంతు చుట్టూ చేతులు బిగించినట్టు ముద్రలు కనిపించడంతో తాగిన మైకంలో నవీన్ ఈ ఘాతుకానికి ఒడిగట్టునట్టు నిర్ధారణకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు తెలుసుకుని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.