తెలంగాణ

పెరిగిన విదేశీ పర్యాటకుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: భారత్‌ను పర్యటించిన విదేశీ పర్యాటకుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 19.5 శాతం పెరిగింది. 2016లో 5.27 లక్షలు ఉంటే, 2017లో ఆ సంఖ్య 6.30 లక్షలకు చేరిందని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే ఈ-పర్యాటక వీసా విధానం ద్వారా దేశానికి వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 55.3 శాతం పెరిగిందని తెలిపింది. కాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు ద్వారా అధిక సంఖ్యలో విదేశీ పర్యాటకులు భారత సందర్శనకు విచ్చేశారు. దాదాపు 15 దేశాల విదేశీ పర్యాటకులు ఈ-వీసా సదుపాయం ద్వారా భారత సందర్శనకు విచ్చేశారని కేంద్ర పర్యాటక శాఖ స్పష్టం చేసింది.