తెలంగాణ
మోదీ మాయలో కెసిఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 June 2017
హైదరాబాద్, జూన్ 24: ప్రధాని నరేంద్ర మోదీ మాయలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పడ్డారని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ విమర్శించారు. రాష్టప్రతి పదవికి యుపిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీరాకుమార్కు ఓటు వేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్కు దండం పెట్టి కోరుతున్నానని సర్వే శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. మీరాకుమార్కు మద్దతు ఇవ్వకపోతే ప్రజలు క్షమించరని ఆయన తెలిపారు. కెసిఆర్ను సమర్థిస్తున్న మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ దీనికి ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. యుపిఎ మహాకూటమిలో ఉన్న నితీష్కుమార్ రాష్టప్రతి పదవికి ఓట్లు వేసే విషయంలో సొంత నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.