తెలంగాణ

నవోదయ స్కూళ్లను పెంచండి: లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో మరిన్ని నవోదయ స్కూళ్లను పెంచాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. నాణ్యమైన విద్య, జాతి సమగ్రతకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాలల వ్యవస్థ దేశంలో చాలా బాగా అమలు జరుగుతోందని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ మొత్తం మీద 9 నవోదయ పాఠశాలలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పెంచడం వల్ల మరిన్ని నవోదయ పాఠశాలలు అవసరమవుతున్నాయని ఆయన కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపారు.