తెలంగాణ

డిల్లీలో రెండో రోజూ ఘనంగా బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 27: దేశ రాజధాని ఢిల్లీలో మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా రెండో రోజూ అందరిని అకట్టుకున్నాయి. తెలంగాణ భవన్‌లో తెలంగాణ ప్రభుత్వం, లాల్ దర్వాజ ఆలయకమిటీ సంయుక్తంగా బోనాల సంబురాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు జరిగిన వేడుకలలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ వినోద్‌కుమార్,ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సమర్పించారు. అనంతరం వెంకయ్యనాయడు మాట్లాడుతూ దేశ రాజధానిలో తెలంగాణ సంస్కృతి, విశిష్టతను తెలిపేలా భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ బోనాల ఉత్సవాలలో తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను ఉపముఖ్యమంత్రి కడియం సమర్పించారు.

చిత్రం.. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు