తెలంగాణ

ప్రాణం తీసిన కుస్తీ సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, జూన్ 30: మద్యం మత్తులో స్నేహితులు సరదాగా కుస్తీ పడిన సంఘటనలో ఓ నిండు ప్రాణం బలైన సంఘటన ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని సోమార్‌పేట్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ కె.శ్రీ్ధర్‌రెడ్డి శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సోమా ర్‌పేట్ గ్రామానికి చెందిన పద్మసాయులు, మాల్‌దొడ్డి పోషెట్టి, మంగళి సాయు కలిసి శుక్రవారం సాయంత్రం మద్యం సేవించారు. ఆ తర్వాత ఆ మత్తులో పద్మసాయులు, మాల్‌దొడ్డి సాయు లు (35) సరదాగా కుస్తీపట్టారు. ఇంతలో అక్కడికి వచ్చిన సాయులు తల్లి ఇద్దరినీ విడిపించి ఇంటికి తీసుకెళ్లింది. అయతే ఇంటికి వచ్చిన కాసేపటికే మాల్‌దొడ్డి సాయులు మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనపై మృతుని తల్లి మాల్‌దొడ్డి బాలవ్వ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామని, మృతదేహానికి ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించి, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు.

చిత్రం.. మాల్‌దొడ్డి సాయిలు మృతదేహం