తెలంగాణ

కోవింద్ ఎన్నికపై బిజెపి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: భారత 14వ రాష్టప్రతిగా రామనాథ్ కోవింద్ ఎన్నికపై బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. రామనాథ్ కోవింద్ ఘన విజయం సాధించడంపై పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆయనకు అభినందనలు తెలిపారు. బిజెపి నాయకులు అంతా కలిసి వెళ్లి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంతోషాన్ని పంచుకున్నారు. వాహనదారులకు, బస్సు ప్రయాణికులకు డాక్టర్ లక్ష్మణ్ మిఠాయిలు పంచి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలకు ప్రతిరూపమే కోవింద్ విజయం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఎస్సీ, ఎస్టీ , బిసి, మైనార్టీ వర్గాలను తమ స్వార్ధానికి ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని దేశ ప్రజలు గుర్తించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎస్సీ మోర్చ అధ్యక్షుడు వేముల అశోక్, మాజీ మంత్రి పుష్పలీల, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, మీడియా కమిటీ కన్వీనర్ సుధాకర్ శర్మ వజ్జా తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. రాష్టప్రతి ఎన్నికల్లో కోవింద్ విజయం సాధించిన సందర్భంగా బిజెపి నేతలు చింతల, లక్ష్మణ్‌లకు మిఠాయలు తినిపిస్తున్న కార్యకర్తలు