తెలంగాణ

నరుూమ్ మృతిపై మెజిస్టీరియల్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నరుూం మృతిపై మెజిస్టీరియల్ విచారణ జరుగనున్నది. గత సంవత్సరం ఆగస్టు 8న పోలీసుల ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఖాజా నయిమొద్దీన్ సంఘటనపై ఈ నెల 28న ఉదయం 11 గంటలకు షాద్‌నగర్ రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయంలో మెజిస్టీరియల్ విచారణ జరుపనున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి, సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ ఎం.కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు తమ వాంగ్మూలాన్ని జూలై 28న నిర్వహించే విచారణలో తెలుపాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.