తెలంగాణ

ఆల్మట్టికి భారీగా నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 22: ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో నిర్మించిన ఆల్మట్టి జలాశయానికి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతున్నట్టు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆల్మట్టి జలాశయానికి ఎగువ ప్రాంతం నుండి 1,08,874 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులో నీటి ఉద్ధృతి పెరుగుతోంది. 129.72 టిఎంసిల సామర్థ్యంగల ఆల్మట్టి జలాశయంలో ప్రస్తుతం 70.01 టిఎంసిల నీరు నిల్వ ఉంది. వరద ఇలాగే కొనసాగితే ఆల్మట్టి నుండి త్వరలోనే గేట్లు ఎత్తే పరిస్థితి కన్పిస్తోంది. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని అక్కడి అధికారులు విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 33 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయం 37.646 టిఎంసిల సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం 23.78 టిఎంసిలు నిల్వ ఉంది. నారాయణపూర్ జలాశయానికి ఎగువ ప్రాంతం నుండి 42,340 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నారాయణపూర్ జలాశయంకు ఎగువ నుండి వస్తున్న వరద ఇలాగే కొనసాగిస్తే వారంలోగా దిగువ భాగంలో ఉన్న జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల పరిధిలో ఇప్పటికే ఆయకట్టు రైతులు ఖరీఫ్‌కు సిద్ధంగా నారుమళ్లను ఉంచుకోగా, జూరాల అధికారులు మాత్రం నాలుగు రోజుల్లో నీటి విడుదలపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఏది ఏమైనా ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టులకు వస్తున్న ఆశాజనక వరదనీటి ఉద్ధృతితో జూరాల రైతుల్లో ఆనందం కలుగుతోంది.