తెలంగాణ
రూ. 10కోట్లతో ఉస్మానియా సెంటినరీ బ్లాక్: కడియం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 August 2017
నక్కలగుట్ట, ఆగస్టు 18: సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని, 10 కోట్ల రూపాయలతో ఉస్మానియా సెంటినరీ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ప్రారంభమైన ఉస్మానియా సెంటినరీ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా అనుబంధ కళాశాలల వౌలిక వసతుల కల్పనకు 200 కోట్లు కేటాయించిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 11 విశ్వవిద్యాలయాలలో 1551 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటిలో ఈ ఏడాది 1061 ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.