తెలంగాణ

ప్రతి బాంబుదాడికీ హైదరాబాద్‌తో లింక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా దాని మూలాలకు సంబంధించి లింక్ హైదరాబాద్‌లో ఉంటోందని విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేందర్ జైన్ పేర్కొన్నారు. కాచిగూడ గుజరాతీ భవన్‌లో భజరంగ్ దళ్ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొన్న సురేందర్ జైన్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సమావేశాల ముగింపు సభ కాచిగూడ మున్నూరు కాపు సంఘం హాలులో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రవీణ్ తొగాడియా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సురేందర్ జైన్ మాట్లాడుతూ ఒవైసీ సోదరుల వల్ల హైదరాబాద్ మినీ పాకిస్తాన్‌గా మారుతోందని పేర్కొన్నారు. ఇండియాను హిందూదేశంగా ప్రకటించే బాధ్యత బజరంగ్‌దళ్ కార్యకర్తలదేనని అన్నారు. లవ్‌జిహాద్‌ను కోర్టు కూడా వ్యతిరేకిస్తోందని, బజరంగ్‌దళ్ కార్యకర్తల వల్లనే హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. వినాయక చవితి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ద్వారా బజరంగ్‌దళ్ హిందు చైతన్యాన్ని పెంచుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ్‌దళ్ నేతలు, విశ్వహిందూ పరిషత్ నేతలు, అధ్యక్షుడు రామరాజు, ప్రాంత కార్యదర్శి మాధవరెడ్డి గారి గాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.