తెలంగాణ

ఆలే నరేంద్రకు బిజెపి నేతల ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత ఆలే నరేంద్ర ద్వితీయ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. శనివారం పార్టీ కార్యాలయంలో నరేంద్ర సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి ప్రస్తుత అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి, పార్టీ నగర్ శాఖ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నరేంద్ర కుమారుడు ఆలే జితేందర్ ప్రభృతులు పాల్గొన్నారు. నరేంద్ర చిత్ర పటానికి పూల దండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు తమ ప్రసంగాల్లో నరేంద్ర చేసిన సేవలను కొనియాడారు. హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ఊరేగింపులన్నింటినీ హుస్సేన్ సాగర్‌కు తీసుకుని వచ్చి దానికి విశిష్టత కల్పించిన ఘనత నరేంద్రనేనని అన్నారు. మజ్లిస్ పార్టీని ధైర్యంగా ఎదుర్కొన్నారని వారు తెలిపారు.