తెలంగాణ

బిసి సబ్-ప్లాన్ హామీని నిలబెట్టుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: అధికారంలోకి రాగానే బిసి సబ్-ప్లాన్‌ను అమలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సోమవారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి పూలే చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి చేశారని చెప్పారు. బిసి సబ్-ప్లాన్‌ను అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన తెరాస అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా దాని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ, పూలే ఆశయాలను సాధించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తున్నదని చెప్పారు.