తెలంగాణ

రాష్ట్ర పండుగగా ‘కొండా’ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: రాష్ట్ర పండుగగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని (ఈ నెల 27న) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ పేరుతో గురువారం జీఓ జారీ అంది. హైదరాబాద్‌లో నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి ఎనిమిది లక్షల రూపాయలు కేటాయించామని, జిల్లాల్లో జరిగే కార్యక్రమానికి 20 వేల రూపాయల చొప్పున కేటాయించామని తెలిపారు. బిసి సంక్షేమ శాఖకు కేటాయించిన నిధుల నుండి ఈ మేరకు డబ్బును వినియోగించుకోవచ్చని సూచించారు. ఇందుకు సంబంధించి బిసి సంక్షేమ శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌పి సింగ్ ఆదేశించారు.