తెలంగాణ

కోదండరామ్ వెంట నక్సలైట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 15: కోదండరామ్ వెంట నక్సలైట్లు ఉన్నారని, అందుకే తెలంగాణలో ఆయన చేపడతానని చెబుతున్న యాత్రకు అనుమతిని ఇవ్వబోమని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. కోదండరామ్‌కు అనుమతి ఇవ్వకూడదని తానే స్వయంగా పోలీసులకు చెప్పానని ఆయన స్పష్టం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన తొలి తెలంగాణ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నాయిని నర్సింహ్మారెడ్డి, టిఆర్‌ఎస్ పార్లమెంట్ ఫ్లోర్‌లీడర్ ఎంపి జితేందర్‌రెడ్డి ముఖ్య అధితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోంశాఖమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలోనే నంబర్ వన్ సిఎంగా పని చేస్తుంటే రాష్ట్రంలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. కోదండరామ్‌ను అరెస్టు చేయడంలో తప్పేముందని అన్నారు. కోదండరామ్ వెంట అంతా నక్సలైట్లు ఉన్నారని, ఆ సమాచారం అంతా తమ దగ్గర ఉందని అన్నారు. ఆయనకు తెలంగాణలో తిరగడానికి వీలులేదని అందుకే అనుమతి ఇవ్వడంలేదని అన్నారు. అసలు అభివృద్ధి జరుగుతుంటే యాత్రల పేరిట ప్రజలను మభ్యపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే తమకు ప్రాధాన్యమని అరాచక శక్తులకు తెలంగాణలో అవకాశాలు లేవని, అలాంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. జెఎసిని ఏర్పాటు చేసింది కెసిఆర్ అని, ఇప్పుడు జెఎసి లేనేలేదని అంతా బయటకు వచ్చి బంగారు తెలంగాణ కోసం పాటుపడుతుంటే కోదండరామ్ మాత్రం ఏవేవో చేస్తున్నారని, అలాంటప్పుడు ఎలా అనుమతి ఇస్తామని అన్నారు. ఓపక్క కోదండరామ్ లాంటి వారు మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధికి అడ్డుపడుతూ గందరగోళానికి తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు కెసిఆర్ పరిపాలన చూసి మింగుడుపడడం లేదని, ఆ పార్టీ పాతాళం నుండి పైకిలేవడం సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..మహబూబ్‌నగర్ జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న
రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి