తెలంగాణ

పంటల బీమా సొమ్ము 20లోగా చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: రైతులకు 2016 ఖరీఫ్‌కు సంబంధించి పంటల బీమా మొత్తాన్ని ఈ నెల 20 లోగా చెల్లించాలని వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. వివిధ బీమా సంస్థలతో మంగళవారం ఆయన సచివాలయంలో సమావేశమై పంటల బీమాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, 2016 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 154 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉండగా, ఇంతవరకు 100 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేశారని, మిగతా మొత్తాన్ని ఈ నెల 20 లోగా జమ చేయాలని ఆదేశించారు. ఈ నెల 25 న మళ్లీ సమావేశమై పరిస్థితిన సమీక్షిస్తానని వెల్లడించారు.

చిత్రం..సచివాలయంలో మంగళవారం బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశమైన వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి