తెలంగాణ

అసెంబ్లీ సమావేశాలపై గజిట్ నోటిఫికేషన్ అదే రోజు నుంచి మండలి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: శాసనసభ, శాసనమండలి ఉభయ సభలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహ్మాచార్యుల పేరిట గజిట్ నోటిఫికేషన్ బుధవారం విడుదల అయింది. ఈనెల 27 ఉదయం 10 గంటలకు ఏకకాలంలో ప్రారంభం కానున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇలా ఉండగా ఉభయ సభలు ఎన్ని రోజుల పాటుకొనసాగేది 26న జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఖరారు కానుంది.