తెలంగాణ
ఎన్టీఆర్ను మరిచి తెలుగు మహాసభలా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 December 2017
హైదరాబాద్, డిసెంబర్ 12: తెలుగు భాషను పరిరక్షించిన టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టి రామారావును మరిచి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తారా? అని టి.టిడిపి సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సాయిబాబా ప్రశ్నించారు. 1988 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చారిత్రాత్మకమైన 587 జివోను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. తెలుగువారిని మదరాసీలుగా పిలువబడుతున్న రోజుల్లో తెలుగు దేశం అనే పేరిట రాజకీయ పార్టీని స్థాపించి తెలుగుదనాన్ని నింపి తెలుగు వారి వాణిని విశ్వవిఖ్యాతం చేశారని ఆయన గుర్తు చేశారు.