తెలంగాణ

తల్లి వెంటే తనయుడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురుమామిడి, డిసెంబర్ 12: తల్లీకొడుకుల పేగుబంధం మరణంలోనూ వీడలేదు. కనిపెంచి, ప్రేమనురాగాలు పంచిన కన్నతల్లి వెంటే తనయుడు తనువు చాలించాడు. ఒకేరోజు తల్లి, కొడుకుల అంతిమయాత్ర, పక్కపక్కనే చితి పేర్చి అంత్యక్రియలు నిర్వహించిన విషాద ఘటన ఇది. ఈ సంఘటన కరీం నగర్ జిల్లా చిగురుమామిడిమండలంలోని సుందరగిరిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సుందరగిరికి చెం దిన ఎనగందుల దుర్గయ్య (60) జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లి ఇటీవలే తిరిగొచ్చాడు. గత కొద్దిరోజులగా అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గయ్య చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరాడు. వృద్ధురాలైన దుర్గయ్య తల్లి మల్లవ్వ (85) అనారోగ్యంతో సోమవా రం వేకువజామున మృతి చెందింది. మల్లవ్వ ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా రు. పెద్ద కుమారుడు దుర్గయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇద్దరు సుందరగిరిలో ఉండగా, మరో ఇద్దరు దుబాయ్‌లో ఉన్నారు. దుబాయ్‌లో ఉన్న కుమారులు మల్లవ్వ అంత్యక్రియలకు వస్తారని మల్లవ్వ భౌతికకాయాన్ని ఫ్రీజర్‌లో ఉంచారు. ఇదిలా ఉండగానే కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గయ్య తన తల్లి మరణవార్త విని గుండెపోటుతో ఆకస్మికంగా మంగళవారం మరణించాడు. ఒకే కుటుంబంలో తల్లి, తనయుడు మృతి చెందడంతో సుందరగిరిలో విషాదం నెలకొంది.
గ్రామస్థులు, మృతుల కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. తల్లి చితి పక్కనే తనయుడి చితిపేర్చి దహన సంస్కారాలు నిర్వహించారు. దుర్గయ్యకు ఒక కుమారుడు, కుమార్తె, భార్య ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీఆర్‌ఎస్ నాయకుడు వంతడ్పుల దిలీప్ కోరారు.

చిత్రాలు..తల్లి మల్లవ్వ *కుమారుడు దుర్గయ్య (ఫైల్‌ఫోటో)