తెలంగాణ

వంద పుస్తకాల ఆవిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వేర్వేరు వేదికలపై శుక్రవారం నాడు దాదాపు వంద పుస్తకాలు ఆవిష్కరణ జరగనుంది. బేగంపేట పర్యాటక భవన్‌లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఒక కార్యక్రమంలో 25 పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే మరో కార్యక్రమంలో ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు రాసిన కవితల సంపుటిని విమలక్క ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో నిఖిల్, హెచ్‌ఆర్కే తదితరులు పాల్గొంటారు. మిగిలిన పుస్తకాలను వేర్వేరు వేదికలపై ఆవిష్కరిస్తారు. సాంస్కృతిక శాఖ, తెలుగు అకాడమి దాదాపు వందకు పైగా జనరంజక గ్రంథాలను సిద్ధం చేశాయి. వాటిని కూడా తెలుగు మహాసభల సందర్భంగా ఆవిష్కరించనున్నారు.