తెలంగాణ

విభజన హామీలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: విభజన హామీల సాధనకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కేంద్రపై ఒత్తిడి తీసుకొస్తామని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారభంకానున్న నేపథ్యంలో జితేందర్‌రెడ్డి స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ విభజన హామీలైన హైకోర్టు విభజన, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఎయిమ్స్ తదితర అంశాలపై పార్లమెంట్‌లో లేవనెత్తుతామని చెప్పారు. తెలంగాణకు ఎయిమ్స్‌ను ప్రకటించినప్పటికీ నిధులు విడుదల చేయడంలో కేంద్రం జాప్యం చేస్తోందని, విభజన అంశంపై మరోసారి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.