తెలంగాణ

19న ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: ఈనెల 19,20 తేదీల్లో టీఎస్‌ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ద్వితీయ మహాసభలు జరుగుతాయని ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ బాలు, కె రాజిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో జరిగే సభలకు రాష్టవ్య్రాప్తంగా 800 మంది డెలిగేట్స్ హాజరవుతారని వారు తెలిపారు. శుక్రవారం యూనియన్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ, యూనియన్ కార్యాలయం నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకు భారీ ర్యాలీ జరుగుతుందని వారు పేర్కొన్నారు. రోజురోజుకూ కార్మికుల సమస్యలు పెరిగిపోతున్నాయని, యాజమాన్యం వేధింపులు ఎక్కువయ్యాయని, అదేవిధంగా పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఈ సభల్లో కార్యాచరణ రూపొందించనున్నట్టు వారు వివరించారు. కార్మికుల సమస్యలు, సంస్థ ఎదుర్కొంటున్న పరిస్థితులపై మహాసభలో విశే్లషణాత్మకంగా లోతైన చర్చ జరుగుతుందని, సమస్యలపై చర్చించి తగు తీర్మానాలు చేయనున్నట్టు వారు తెలిపారు.