తెలంగాణ

ఉప రాష్టప్రతికి ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోనే నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడుకు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు ఘనస్వాగతం పలికారు. ఉప రాష్టప్రతికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రులు నాయని నర్సింహారెడ్డి, టి పద్మారావు గౌడ్‌లతో పాటు రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్ పి సింగ్, జిఎడి ముఖ్యకార్యదర్శి అదర్ సిన్హా, డిజిపి మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ వివి శ్రీనివాసరావు, కలెక్టర్ యోగితా రాణా, ప్రోటోకాల్ డిప్యుటీ సెక్రటరీ అరవిందర్ సింగ్ తదితరులున్నారు. ఉప రాష్టప్రతి తిరిగి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తారు.