తెలంగాణ

నాయా బ్రాహ్మణుల నైపుణ్యం కోసం రూ.250కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: నాయి బ్రాహ్మణుల వృత్తి పరంగా మరింత ముందుకు సాగేందుకు అత్యాధునిక శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం నాడు మాసబ్‌ట్యాంకులోని సంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో కుల వృత్తిదారులు రాణించాలంటే వారికి మెరుగైన అత్యాధునిక శిక్షణ అవసరమని అన్నారు. నాయి బ్రాహ్మణుల వృత్తి నైపుణ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 250 కోట్ల రూపాయిలు మంజూరుచేసిందని అన్నారు. ఈ వృత్తిలోని మహిళలకు నూతన టెక్నాలజీలో శిక్షణ ఇచ్చి సంచార బ్యూటీ పార్లర్లను ఏర్పాటు చేయించనున్నట్టు తెలిపారు. నాయి బ్రాహ్మణులతో పాటు రజక సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం 250 కోట్లు మంజొరు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అశోక్ కుమార్, అదనపు కార్యదర్శి సైదా, అదనపు సంచాలకుడు కె అలోక్‌కుమార్, బిసి గురుకుల పాఠశాలల కార్యదర్శి మల్లయ్య బట్టు, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఎండి చంద్రశేఖర్, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..శుక్రవారం హైదరాబాద్ లో నాయా బ్రాహ్మణుల శిక్షణ కార్యక్రమాన్ని
ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న మంత్రి జోగు రామన్న