తెలంగాణ

జంపన్న నమ్మక ద్రోహి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న పార్టీకి నమ్మక ద్రోహం చేశారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆరోపించారు. ఆయన పేరుతో ఒక లేఖ మీడియాకు విడుదలయ్యింది. మావోయిస్టు పార్టీ నుంచి ఏడాది కిందటే జంపన్నను సస్పెండ్ చేశారని తెలిపారు. పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాతే ఆయన పార్టీతో విభేధించారని పేర్కొన్నారు. జంపన్న పోలీసులుకు లొంగిపోతున్నట్లు మావోయిస్టు పార్టీకి ఎక్కడా చెప్పలేదని తెలిపారు. పార్టీపై జంపన్న చేసిన ఆరోపణలన్నీ అర్థం లేనివని కొట్టిపారేశారు. కేవలం స్వార్ధం, రాజకీయ ప్రయోజనాలకోసమే పార్టీని వీడారని అభయ్ ఆ లేఖలో ఆరోపించారు.