రాష్ట్రీయం

దాతలకోసం ప్రత్యేకంగా ఎస్‌ఎంఎస్ అప్లికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 3: టిటిడికి విరాళాలు అందిస్తున్న దాతలకు పారదర్శకంగా సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఎస్‌ఎంఎస్ అలర్ట్ పంపేందుకు అప్లికేషన్ రూపొందించాలని టిటిడి ఇ ఒ డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమల్లోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. దాతలు తిరుమలకు విచ్చేసినప్పుడు శ్రీవారి దర్శనం, బస, లడ్డూ,ప్రసాదం ఇతర సదుపాయాలు అందుకున్న వెంటనే ఎస్‌ఎంఎస్ అలర్ట్ అందేలా అప్లికేషన్ తయారుచేయాలని ఐటి విభాగం అధికారులను ఆదేశించారు. ఇలా చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని, అంతేకాకుండా అక్రమాలకు తావులేకుండా జరుగుతుంది ఇఓ అన్నారు. దాతలు కూడా తమకు అందుతున్న సదుపాయాలను తెలుసుకునేందుకు వీలవుతుందని అన్నారు.