తెలంగాణ

ప్రేమజంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జనవరి 19: గడ్డి మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లాలో విషాదాన్ని నింపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దుగ్గొండి మండలంలోని రేఖంపల్లికి చెందిన కొగులూరి భరత్ (25) నర్సంపేట నెక్కొండ రోడ్‌లో ఇండియన్ సాఫ్ట్ స్కిల్స్ పేరుతో కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్నాడు. కాగా, ఖానాపురం మండలంలోని బుధరావుపేటకు చెందిన షేక్ నజ్మిన్.. కొంతకాలం క్రితం ఈ ఇన్‌స్టిట్యూట్‌లో కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేరింది. వీరిద్దరూ పోస్టు గ్రాడ్యుయేషన్ చదివారు. ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆరు నెలలుగా వీరి ప్రేమాయణం సాగుతోంది. అయితే, తాజాగా నజ్మిన్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు. అబ్బాయిని సైతం పెద్దలు ఓకే చేశారు. ఈ క్రమంలో నజ్మిన్ ఈ విషయాన్ని ప్రేమికుడైన భరత్ దృష్టికి తీసుకెళ్లింది. తమ ప్రేమకు కులాలు, మతాలు అడ్డుగా వస్తాయని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వెంటనే వీరు ఆన్‌లైన్‌లో గడ్డిమందుకు ఆర్డర్ చేసి తెప్పించుకొన్నారు. ప్రేమికులిద్దరూ బుధవారం సాయంత్రం కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆ గడ్డి మందు తాగేశారు. ఇంతలోనే కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చిన వారి సహచరులు అపస్మారక స్థితిలో ఉన్న ఈ ప్రేమికులిద్దరిని వరంగల్‌కు తరలించారు. భరత్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. భరత్ మృతిచెందిన అరగంటకు ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోంలో చికిత్స పొందుతున్న నజ్మిన్ సైతం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని వరంగల్ ఎంజీఎంలో ప్రేమికులిద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.