తెలంగాణ
టీడీపీ నేత ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 January 2018
మంచిర్యాల, జనవరి 22 : మంచిర్యాల జిల్లా నెనె్నల మండల కేంద్రానికి చెందిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు రంగు రామాగౌడ్ (42) సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి తనపై అట్రాసిటీ కేసులు పెట్టారని తెలిపినప్పటికీ అధికారులు పట్టించుకోక పోవడంతో మనస్తాపానికి గురైన రంగు రామాగౌడ్ పురుగుల మందు తాగి అక్కడికక్కడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.