తెలంగాణ

విష ప్రచారం.. తప్పుడు కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కోర్టులో తప్పుడు కేసులు వేస్తున్నారని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి మర్రి విషపూరితమైన ప్రచారంతో లబ్ధిదారులను అయోమయానికి గురిచేయడమే కాకుండా పనులను అడ్డుకునేందుకు కోర్టులో తప్పుడు కేసులు వేశారని ఆయన ఆరోపించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పనులను మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శననూ ఆయన తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం కోట్లాది రూపాయలతో తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ, రోడ్లు వంటి సౌకర్యాలను కల్పిస్తూ డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంతో మురికివాడల కొత్త రూపును సంతరించుకోబోతున్నాయని ఆయన తెలిపారు.

చిత్రం..సనత్‌నగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలిస్తున్న మంత్రి తలసాని