తెలంగాణ

తలసానిని కేబినెట్ నుంచి తప్పించాలి : టీ.టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, మంత్రి తలసానిని కేబినెట్ నుంచి తప్పించాలని టీ. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో తలపెట్టిన రైతుదీక్ష పోస్టర్‌ను రావుల బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పుల బాధతో రాష్ట్రంలో 2600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతులను ప్రభుత్వం అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు. ఆత్మహత్యలను నిర్థారించడానికి దగుల్బాజీ కమిటీ వేశారని, చనిపోయిన రైతులను అవమానించేలా కమిటీ నివేదికలు ఉన్నాయని మరోనేత వంటేరు ప్రతాప్‌రెడ్డి ధ్వజమెత్తారు.