ఆంధ్రప్రదేశ్‌

తుని విధ్వంసంలో మరో ఏడుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా ఇటీవల తునిలో జరిగిన విధ్వంసకాండకు సంబంధించి సిఐడి పోలీసులు మంగళవారం నాడు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. సిసి టీవీ ఫుటేజి, వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా, తనను అరెస్టు చేయాలంటూ అమలాపురం పోలీస్ స్టేషన్‌లో హంగామా సృష్టిస్తున్న కాపు ఉద్యమనేతతో చర్చలు జరపాలంటూ తూ.గో. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎస్పీ అమలాపురం చేరుకుని ముద్రగడతో మాట్లాడతారు. కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా సిఐడి పోలీసులను సంప్రదించాలని ముద్రగడకు ఎస్పీ చెబుతారని సమాచారం. పోలీస్ స్టేషన్‌లో ముద్రగడ బైఠాయించడంతో పోలీసు శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా పోలీసులకు ఆదేశాలు అందాయి.