బిజినెస్

‘ఉదయ్’లో ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక డిస్కమ్‌ల పునరుద్ధరణకు కేంద్రం చేయూత
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: రుణభారంతో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకంలో చేరిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ట్విట్టర్‌కు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. డిస్కమ్‌ల పునరుద్ధరణకు ఉదయ్ పథకం ప్రయోజనాలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. కాగా, ఈ పథకంలో జార్ఖండ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా రాష్ట్రాలు కూడా చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే వీటికంటే ముందుకు ఉదయ్‌లో చేరేందుకు ఆంధ్రప్రదేశ్ సుముఖత వ్యక్తం చేస్తూ, కేంద్రానికి సమాచారమిచ్చింది.