జాతీయ వార్తలు

‘ఉగ్ర’ చర్యలపై అప్రమత్తత: కేంద్రం హెచ్చరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: విధ్వంసకాండకు ఉగ్రవాదులు వ్యూహరచన చేస్తున్నారన్న సమాచారం అందడంతో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోసారి హెచ్చరించింది. దిల్లీ, ముంబయి, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పాటు విజయవాడ, జైపూర్, భోపాల్, లక్నో, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరించే ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. పాకిస్తాన్ నుంచి కొందరు ఉగ్రవాదులు సముద్రం ద్వారా భారత్‌లోకి చేరుకున్నారన్న వార్తల నేపథ్యంలో గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని నిఘా వర్గాలు కేంద్రానికి సూచించాయి. దీంతో సోమవారం ఉదయం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భద్రత విషయంలో రాజీ పడవద్దని ఆయన గుజరాత్ సహా వివిధ రాష్ట్రాలకు సూచించారు.