జాతీయ వార్తలు
యూపీలో జీపు, బస్సు ఢీకొని 12 మంది పర్యాటకులు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 2 January 2016
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని బల్రాంపూర్లో జీపు, విదేశీ పర్యాటకులతో వెళ్తున్న బస్సు ఒకదానినొకటి ఢీకొనడంతో 12 మంది పర్యాటకులు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తులసిపూర్లోని దేవి పటాన్ ఆలయం నుంచి కొందరు పర్యాటకులు తిరిగి వస్తుండగా వారి జీపు .. బెల్హా నుంచి విదేశీ పర్యాటకులతో వస్తున్న బస్సు మీదికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పదిమంది అక్కడికక్కడే మరణించినట్లు ఎస్పీ ఉమేశ్ చంద్ర శ్రీవాత్సవ వెల్లడించారు. మరో ఇద్దరు పర్యాటకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విదేశీ పర్యాటకులంతా క్షేమం.