అంతర్జాతీయం
ఉరీ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 September 2016
శ్రీనగర్: పాక్ సైన్యం జమ్ము కాశ్మీర్లో ఉరీ సెక్టార్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద మంగళవారం సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపింది. ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి జరిగిన రెండు రోజుల్లోనే పాక్ సైన్యం సరిహద్దులో కాల్పులకు తెగబడింది. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పి కొట్టింది. పాక్ నుంచి వచ్చిన జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారే ఈ ఘోరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పాక్కు గట్టి బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తున్న సమయంలో సరిహద్దులో పాక్ కాల్పులకు దిగింది.