ఆంధ్రప్రదేశ్‌

ఏపీకి ఇప్పుడే ఎక్కువ అన్యాయం ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడిన దానికి, ఇప్పుడు మాట్లాడుతున్న దానికి సంబంధం లేదని, విభజన సమయంలో కంటే ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడే ఎక్కువ అన్యాయం జరుగుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆదివారం విజయవాడలో నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌లో అన్నారు. విభజనపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం చేసిన రోజున రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షల కోట్లు కావాలని అడిగిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం రూ.3వేల కోట్లు ఇస్తే ఎందుకు సరిపెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. హోదా ఇవ్వలేకపోతే ఆ విషయాన్ని నేరుగా చెప్పాలి గానీ వెంకయ్యనాయుడు అసత్యాలు చెప్పడం సరికాదన్నారు..