విజయవాడ

ఎందుకీ రాజీనామా డ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, మార్చి 10: కేంద్రంలో మంత్రి పదవులకు రాజీనామా చేయించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్‌డీఏ నుండి మాత్రం ఎందుకు బయటకు రావడం లేదని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శనివారం నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈధర్నాను ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ 5కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాలు, పార్టీలు పోరాటం చేస్తుంటే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నాటకాలు మొదలు పెట్టాయన్నారు. ఏపీలో గత ఏడాది బడ్జెట్‌లో రూ.500 కోట్లను నిరుద్యోగ భృతికి కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా రాష్ట్రంలోని ఏ నిరుద్యోగికి ప్రభుత్వ అందించలేదన్నారు. ఇప్పటి బడ్జెట్‌లో రూ.1000కో ట్లు కేటాయించినప్పటికీ, ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 33లక్షల మంది నిరుద్యోగులకు అది ఏమాత్రం సరిపోదన్నారు. సుమారు రూ.18వేల కోట్లు అవసరం కాగా కేవలం రూ. 1000కోట్లే కేటాయించడంలోనే బాబు చిత్తశుద్ధి కనిపిస్తోందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో విద్యార్థి విభాగం నా యకులు శ్రీనివాస కళ్యాణ్, అశోక్, అ ర్జున్, శ్రీకాంత్, నగర విభాగం నాయకులు సాయి శ్రీకాంత్, వినోద్, సుభానీతో పాటు పలువురు పాల్గొన్నారు.