రాష్ట్రీయం

విశాఖ చేరుకున్న రాష్టప్రతి, ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. రాత్రి 9.15 గంటలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక విమానంలో ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్‌కు చేరుకోగా, ప్రధాని మోదీ 10 గంటలకు ప్రత్యేక విమానంలో డేగాకు వచ్చారు. వీరికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత నౌకాదళ ప్రధానాధికారి ఆర్‌కే ధావన్, తూర్పు నౌకాదళ ప్రధానాధికారి సతీష్ సోనీ, రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎంపి కొత్తపల్లి గీత, జిల్లా కలెక్టర్ యువరాజ్, వుడా విసి బాబూరావు నాయుడు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. రాష్టప్రతి, ప్రధాని విమానాశ్రయం నుంచి నేరుగా నేవీ మెస్‌కు బయల్దేరి వెళ్లారు.