ఆంధ్రప్రదేశ్
గోదావరి జిల్లాల్లో వర్ష బీభత్సం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 May 2016
కాకినాడ: తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. ఈదురుగాలులు వీచడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం తదితర తీర ప్రాంతాల్లో అలలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్ర తీరం కోతకు గురవుతోంది. ఏ క్షణంలో తుపాను ముంచుకొస్తుందోనని తీర గ్రామాల ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.