జాతీయ వార్తలు

పెళ్లి మంటపానికి వధువు పాదయాత్ర..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కావేరీ జలాల వివాదం నేపథ్యంలో కర్నాటక, తమిళనాడులో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోగా- గత్యంతరం లేని పరిస్థితిలో పెళ్లి మంటపానికి వధువు తన కుటుంబ సభ్యులతో కాలినడకన బయలుదేరింది. ఆందోళనల కారణంగా కర్నాటక నుంచి తమిళనాడుకు రవాణా వ్యవస్థ బంద్ అయింది. పెళ్లి ముహూర్తం సమీపించడంతో వధువు, ఆమె బంధువులు కాలినడకన తమిళనాడుకు బయలుదేరారు. కర్నాటకు చెందిన ప్రేమ అనే యువతికి సమీపంలోని తమిళనాడు గ్రామానికి చెందిన యువకుడితో బుధవారం పెళ్ల జరగాల్సి ఉంది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రేమ తన కుటుంబ సభ్యులతో కాలినడకన పెళ్లి మండపానికి బయలుదేరింది. బుధవారం ముహుర్తానికి ముందే తాము పెళ్లి మండపానికి చేరుకుంటామని వధువు బంధువులు తెలిపారు.