భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా!...13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ లోపల హరిహర పుత్రుడు జన్మించాలని మేమంతా ఆశతో ఎదురుచూస్తున్నాము’’ అన్నారు ఇంద్రాది దేవతలు గూడా త్రిమూర్తులను దర్శించి!
‘‘త్వరలోనే మీ కోరిక తీరగలదు! వేచి వుండండి’’ అని అభయం ప్రసాదించి వాళ్లను పంపివేశారు శివకేశవులు!
‘‘పరమేశ్వరా! ఇక నేను కూడా వైకుంఠానికి తిరిగి వెళతాను!’’ అంటూ లేచాడు మహావిష్ణువు!

అంతవరకు కైలాసంలోనే దేవతలతో సమావేశం జరిగింది! వాళ్లు వెళ్లాక మహావిష్ణువు వెళ్లడంతో పరమేశ్వరుడు ఆలోచనామగ్నుడైనాడు!
అంతర్మందిరంలోనుండి కనిపిస్తున్న పుష్పోద్యానం వైపు దృష్టి సారించిన పరమశివుని కనుబొమ్మలు ముడివడ్డాయి.
పుష్పోద్యానంలో అతిలోక లావణ్యవతియైన ఒక సుందరి నడయాడుతుండటం చూసి ‘ఎవరో జగన్మోహిని! ఈ వనంలోకి ఎలా వచ్చింది? వెళ్లి పలకరిస్తాను!’’ అనుకుంటూ వనంలోకి ప్రవేశించాడు పరమేశ్వరుడు!
ఆమె అందం స్వామి మనస్సుకు ఆహ్లాదం కలిగించింది! చిరునవ్వు మన్మథబాణంలా వచ్చి తగిలేసరికి విచలితుడౌతూ ‘‘సుందరీ! ఎవరివి నీవు? ఈ వనంలో ఒంటరిగా విహరిస్తున్న నిన్ను చూస్తుంటే నీతో జంటగా విహరించాలనిపిస్తున్నది సుమా!’’ అంటూ ఆమెను సమీపించాడు!
ఆమె అంగీకారంగా ముసి ముసి నవ్వులు నవ్వి చేయందించడంతో ఇద్దరూ వనంలో విహరిస్తూ ఆనందించ

సాగారు! కళ్లలో కళ్లు కలిపి నాట్యం చేయసాగారు! ఆ సమయంలో ఇద్దరి శరీరాలనుండి తేజస్సులు వెలువడి పచ్చని పచ్చికమీద ఒకటై క్రమంగా బాలునిగా రూపుదిద్దుకున్నాయి. జగన్మోహిని మాయమై ఆ స్థానంలో మహావిష్ణువు నిలిచాడు! పరమేశ్వరుడు చిరునవ్వుతో చూస్తూ ‘‘నారాయణా! నీ విష్ణుమాయలో ఓలలాడించి నన్ను వివశుడిని చేసావు సుమా! చమత్కారివే!’’ అన్నాడు.
దివ్యతేజంతో ప్రకాశిస్తున్న బాలుడిమీద పుష్పవృష్టి కురిపిస్తూ ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. విషయం తెలిసి వచ్చిన దేవగణాలు, బ్రహ్మ, నారదాది మునులు!
‘‘హరి మాటల అంశతో ప్రభవించిన దివ్య శిశువుకు మా ప్రణామాలు! ఈ బాలుడిని చూస్తుంటే మా కష్టాలిక త్వరలోనే తీరగలవన్న ఆనందంతో పరవశించిపోతున్నాయి మా హృదయాలు!’’ అంటూన్న దేవతలవైపు ప్రసన్నంగా చూసారు హరిహరులు!
పరమేశ్వరుడు ‘‘ఈ బాలుని భూతనాధుడనే పేర భూతగణాలకు నాయకునిగా అభిషిక్తుడిని కావిస్తున్నాను!
నందీశ్వరాది ప్రమథ గణాల చేత పూజింపబడగలడు!’’ అంటూ శిరస్సుమీద చేయి వుంచాడు!
మహావిష్ణువు ఆ చేతిమీద తన హస్తాన్ని వుంచి ‘‘్ధర్మశాస్తా అనే పేరుతో ధర్మానికి అధిదేవత కాగలడు ఈ చిరంజీవి!’’ అన్నాడు! తన కంఠం నుండి ఒక మణిహారాన్ని తీసి ఆ బాలుడి మెడలో వేశాడు మహావిష్ణువు!‘‘దేవతలారా! మణికంఠుడనే సార్థక నామంతో ఈ బాలుడు భూలోకంలో పనె్నండు సంవత్సరాలు రాజవంశంలో ప్రవర్థమానుడై మహిషిని సంహరించి మీకు ఆనందాన్ని కలిగిస్తాడు!
భూమిమీద ధర్మాన్ని సుస్థిరం కావిస్తాడు!’’ అని తెలియజెప్పాడు.
‘‘్ధన్యులం స్వామీ! ధన్యులం! హరిహర పుత్రుడు మణికంఠునికి జయము! జయము!’’ అంటూ జయజయధ్వానాలు చేసి తృప్తిగా తిరిగి వెళ్లారు ఇంద్రాది దేవతలు.!
‘‘విప్ర పూజ్యం విశ్వ వంధ్యం విష్ణుం శంభు ప్రియం సుతం
క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం’’ అంటూ హరిహరుల మధ్య ఆసీనుడైన మణికంఠునికి నమస్కరించి ‘‘మహిషిని మర్దించగల వీరపుత్రుడు జన్మించాడు! భూలోకం చేరి ఏమేమి వింతలు చూపనున్నాడో’’ అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాము!
స్వామీ! ఎప్పుడెప్పుడు ముక్తి లభిస్తుందని వ్యధ చెందుతున్న సుందర మహిషానికి విముక్తి ప్రసాదించినట్లే గదా! నారాయణ! నారాయణ!’’ అంటూ భూలోకం వైపు సాగిపోయాడు నారద మహర్షి!
2వ భాగం
ఏకాగ్రతతో వింటున్న నైమిశారణ్య వాసులవైపు ప్రసన్నంగా చూస్తూ చెప్పడం కొనసాగించాడు సూత మహర్షి! ‘‘శౌనకాది మునులారా! హరిహర పుత్రుడైన భూతనాధుడు ఆవిర్భవించిన వైనం విన్నారు గదా! ఆవిర్భవించిన వెంటనే యువకుడైన భూతనాథుడు కొంతకాలం కైలాసంలో ప్రమథ, భూత గణాల పూజలందుకుంటూ గడిపాడు! పార్వతీ పరమేశ్వరులకు, గణపతి, కుమారస్వాములకు ఆనందాన్ని ప్రసాదించాడు! అతనికి పూర్ణ- పుష్కళ అనే ఇద్దరు దేవకన్యలతో వివాహం జరిపించింది పార్వతీమాత!
***

-ఇంకాఉంది

-డా. టి. కళ్యాణీసచ్చిదానందం