మంచి మాట

ఆహార శుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ భూమీద ఉన్న ప్రతి ప్రాణి మనుగడకీ గాలి, నీరు, ఆహారం అవసరం. గాలి నీరు అన్ని జీవులకీ సహజంగా లభించేవే. ఇక ఆహార విషయానికి వస్తే మనిషి తప్ప మిగతా జంతుజాలంలో ఒక్కో జంతువుకు ఒక్కో నిర్దేశిత ఆహరమంటూ ఉంది. కాని మనిషి మాత్రం భిన్నరుచులతో విభిన్న ఆహార పదార్థాలను సేవిస్తుంటాడు. ఈ ఆహారమే మనిషి యొక్క శారీరక ఎదుగుదలతో పాటు మానసిక పరిపక్వతకు తోడ్పడుతుంది. మనిషి తీసుకొనే ఆహారాన్ని బట్టి అతనిలోని మానసిక గుణాలు అభివృద్ధి చెందుతాయి. ఎలా అంటే ఆహారం మూడు రకాలు సాత్వికాహారం, రాజసాహారం, తామసాహారం. సాత్వికాహారం అంటే పండ్లు, కాయగూరలు మొదలైన శాకాహారం మనిషిలోని సత్వగుణాన్ని పెంపొందిస్తుంది. రాజసాహారం అంటే అధికమైన ఉప్పూ కారం మసాలా దినుసులతో కూడిన మాంసాహారం రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. ఇక పులుపు నిల్వచేసిన పదార్థాలు రకరకాలైన మాంసాహారం తమోగుణాన్ని కల్గిస్తాయి.
సత్వగుణ లక్షణాలు, నిర్వికారం, శాంతం, సహనం, క్షమ, భూతదయ, నిర్మోహత్వం, నిరహంకారం, అసూయ చెందకపోవడం రజోగుణ లక్షణాలు. కోరికలు, క్రోధం, మోహం, అహంకారం, అసూయ తమోగుణ లక్షణాలు, కామం, దురాశ , క్రోధం, వ్యామోహం, గర్వం, అసూయ, నిద్ర, భయం, పిరికితనం ఈ లక్షణాలు గల త్రిగుణాలకు మూలమైన ఆహారంలో మూడు దోషాలు
1. జాతిదోషం, 2. గుణదోషం, 3. భావ దోషం జాతి దోషం అంటే ఆహారాన్ని తయారుచేసేటప్పుడు పాటించని నియమాల వల్ల అపరిశుభ్రత వల్ల కలిగే దోషం గుణదోషం అంటే ఒక్కో ఆహారపదార్థానికి ఒక్కో అనారోగ్య కరమైన దోషం ఉంటుంది. ఉష్ణం (వేడి) వాతం, కఫం, పైత్యం మొదలైనవి. భావదోషం అంటే ఆహారాన్ని వండే వారిలో ఉండే చెడు భావాల వల్ల కలిగే దోషం.
జాతీ దోషం కనిపెట్టవచ్చు. గుణదోషం తెలుసుకోగలం కాని భావ దోషమే మనకు తెలియదు. అలాంటి భావదోషం బారినపడ్డ ఓ సన్యాసి జీవితమే ఉదాహరణగా చెప్పవచ్చు. ఓ సన్యాసి తన పర్యటనలో భాగంగా ఓ దేశసంచారం చేస్తూ ఆ దేశుపు రాజుగారిని సందర్శించేడు. ఆ రాజుగారు సన్యాసికి సవినయంగా మొక్కి స్వాగతం పలికి ఆరోజ తమ ఆతిథ్యాన్ని స్వీకరించమనికోరేడు. సన్యాసి సరేనని అంగీకరించేడు. సన్యాసి సరేనన్నాడు. సన్యాసికి అతిథి గృహం ఇచ్చారు. విందుభోజనం ఏర్పాటు చేశారు. సన్యాసి భోజనం తరువాత విశ్రాంతి తీసుకొంటూ ఆ గదిని పరిశీలించగా అంతలో బంగారు వెండి పాత్రలు, సామగ్రి అలంకరించినట్లుగా పేర్చబడి ఉన్నాయి. హఠాత్తుగా సన్యాసి అనుకోకుండానే మనసులో ఒక దురాలోచన వచ్చింది. ‘‘నేను నా జానెడు పొట్ట నింపుకోవడం కోసం ఇలా పర్యటనలు చేస్తూ దేశసంచారం చేస్తూ ఇతరుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడుతున్నానంటే భిక్షాటన చేస్తున్నట్లేకదా. ఎంతకాలం ఇలా? అదేక్కడ ఉన్న బంగారూ, వెండి పాత్రలలో గాని, సామగ్రిలో గాని మరేదానిని తీసుకుపోయనా కొన్నాళ్ల పాటు నా ఆహారానికి డోకా ఏమీ ఉండదు’’ అని అనిపించింది. అదే తడవుగా ఆరాత్రి గడిచేక తెల్లవారు జామున తన జోలెలో బంగారు వెండి పాత్రలు వేసుకొని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఒకవేళ తాను ఎవరికంట నైనా పడినా సన్యాసిని కాబట్టిఅనుమానించే ప్రసక్తి ఉండదనే ధీమాలో సన్యాసి ఊరు పొలిమేర దాటాడు. తెలతెలవారుతుంటే కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ఆ తరువాత తాను చేసిన పని ఏమిటా అని ఆలోచించి పొరపాటుఅని తెలుసుకున్నాడు. తన దుశ్చర్యకు తనను తానే తిట్టుకుని దానికి కారణం ఆ ఇంటిలో తిన్న ఆహారమే నని తెలుసుకొని తిరిగి వారింటికి వెళ్లి జరిగింది చెప్పి తప్పును సరిదిద్దుకుని ఆ ఇంటివారికి జరిగిన సంగతి అంతాచెప్పి దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే వంటవాని దోషగుణంగా భావించి ఆ వ్యక్తికి విషయం చెప్పి మంచిమార్గంలోకి మళ్లమని సూచించాడు. ఇలా ఆహారంలో దోషం ఉన్నందువల్ల మనుషుల గుణాలల్లోదోషాలు ఏర్పడానికి కారణ అవుతుందంటారు.

- పతి మురళీధర శర్మ