రాష్ట్రీయం

వంశధార నదిలో చిక్కుకున్న కూలీలు సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరుబుజ్జిలి: వంశధార నదిలో చిక్కుకున్న కూలీలు, డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. రెండు గంటలు పాటు శ్రమించిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించి బాధితులను ఒడ్డుకు చేర్చారు. శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో ఇసుకర్యాంప్‌లో ఇసుకను తోడేందుకు వెళ్లిన కూలీలు వంశధార నది ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వంశధార నదిలో వరద నీరు అధికం కావటంతో జేజీబీ డ్రైవర్లతో సహా మొత్తం 53మంది చిక్కుకుపోయారు. డ్రోన్ల సాయంతో వారిని కనిపెట్టి సురక్షితంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సహాయక సిబ్బందిని, అధికారులను సీఏం చంద్రబాబు అభినందించారు.