జాతీయ వార్తలు

బిజెపి ఎంపీ వరుణ్ గాంధీకి కోర్టు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలిబిత్ (యుపి): బిజెపి ఎంపి వరుణ్‌గాంధీకి ఇక్కడి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు ఈ చర్య తీసుకుంది. 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా వరుణ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని రెండు కేసులు దాఖలయ్యాయి. 2013లో స్థానిక కోర్టు ఆ కేసుల్లో వరుణ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, అసద్ హయత్ అనే సామాజిక కార్యకర్త జిల్లా కోర్టులో అప్పీలు చేశాడు. కోర్టు విచారణకు హాజరు కానందున జిల్లా కోర్టు తాజాగా వరుణ్‌కు నోటీసులు జారీ చేసి, ఈనెల 30న విధిగా హాజరు కావాలంటూ ఆదేశించింది.