జాతీయ వార్తలు
ఆధ్యాత్మిక గురువు వస్వాని కన్నుమూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 12 July 2018
పూణే: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు వస్వాని కన్నుమూశారు. 1918 ఆగస్టు 2న నేటి పాకిస్థాన్లోని హైదరాబాద్లో జన్మించిన ఆయన మరో కొద్దిరోజుల్లో వంద సంవత్సరాలు పూర్తిచేసుకోనున్నారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. భక్తులు శోకసముద్రంలో మునిగిపోయారు. శాఖాహారం వల్ల కలిగే ఉపయోగాలపై అనేక ప్రసంగాలు చేశారు. ఆయన పూర్తి పేరు జస్వాన్ పహ్లజ్రాయ్ వస్వాని. దాదాపు 150కి పైగా పుస్తకాలు రాశారు. సాధువస్వాని మిషన్ ద్వారా శాఖాహారం, ప్రపంచశాంతి కోసం కృషిచేశారు.