జాతీయ వార్తలు
వీర జవాన్లకు రాజ్నాథ్ నివాళి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 February 2019
జమ్మూకాశ్మీర్: పూల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన దాడిలో అమరులైన జవాన్లకు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారంనాడు నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన జవాన్ల పార్థీవదేహాలపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అంతేకాదు జవాన్ల శవపేటికలను భుజాలపై మోసి.. సైన్యం పట్ల తన కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు. హోంమంత్రితో పాటు గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆర్మీ నార్తన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ నివాళులర్పించారు. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.